www.ntodaynews.com
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజుకు 14 రోజుల రిమాండ్
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
విజయవాడ: సాయికృష్ణ కేసులో అరెస్టైన సీఐ నాగరాజుకు విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
ఈ కేసులో ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కొనసాగిస్తోంది. దర్యాప్తులో భాగంగా మరిన్ని వివరాలు రాబట్టేందుకు నాగరాజును పోలీసు కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సీఐ నాగరాజు రిమాండ్తో సాయికృష్ణ కేసు దర్యాప్తు మరింత కీలక దశకు చేరుకుంది. కేసుకు సంబంధించిన పలు అంశాలపై సిట్ అధికారులు లోతుగా విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. తదుపరి దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.