సీఎం రాక కోసం కలిదిండిలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎదురుచూపులు
సీఎం రాక కోసం కలిదిండిలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఎదురుచూపులు
కలిదిండి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో భాగంగా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి గ్రామానికి రానున్న నేపథ్యంలో చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ కలిదిండికి చేరుకున్నారు. ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుసుకుని చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యే సిద్ధమయ్యారు.
ముఖ్యమంత్రి రాక కోసం కలిదిండి హెలిప్యాడ్ వద్ద ఏర్పాటు చేసిన ఎల్-1 లాంజ్లో ఎమ్మెల్యే రోషన్ కుమార్ జిల్లా మంత్రి కొలుసు పార్థసారధి, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షుడు బడేటి చంటి, ఇతర సహచర ఎమ్మెల్యేలతో కలిసి వేచి ఉన్నారు. ముఖ్యమంత్రిని కలిసే సమయంలో నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలకు సంబంధించిన అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.