www.ntodaynews.com
సింగరేణి ఇక బొగ్గుకే పరిమితం కాదు..
తెలంగాణ
సింగరేణి ఇక బొగ్గుకే పరిమితం కాదు..
సింగరేణిని బొగ్గు గనులకే పరిమితం చేయకుండా కీలక, వ్యూహాత్మక ఖనిజాల రంగంలో విస్తరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. కర్ణాటకలోని దేవదుర్గ్ బంగారం, రాగి ఖనిజ బ్లాక్ అన్వేషణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. గురువారం దేవదుర్గ్ను
అధికారులతో కలిసి సందర్శించనున్నట్లు తెలిపారు.
దేశ, అంతర్జాతీయ ఖనిజ వేలాల్లో సింగరేణి చురుగ్గా పాల్గొనాలని, రాగి, గ్రాఫైట్, లిథియం, కోబాల్ట్ పాటు వానాడియం, టైటానియం వంటి ఖనిజాలపై దృష్టి సారించాలని ఆదేశించారు.