BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

​సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల ఆందోళన కలెక్టరేట్ ముట్టడి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
20 Apr, 2026 - 05:38 PM
162 వీక్షణలు

​సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల ఆందోళన: కలెక్టరేట్ ముట్టడి

మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం భారీ ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ, మందమర్రి ఏరియాలో గత 12 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులను సింగరేణి యాజమాన్యం కొత్త టెండర్లు పిలవకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల గత రెండు నెలలుగా కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే సుమారు వెయ్యి మంది కార్మిక కుటుంబాలు రోడ్డున పడటం దురదృష్టకరమని, తక్షణమే అధికారులు స్పందించి పాత పద్ధతిలోనే కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని, దీనికి సింగరేణి అధికారులతో పాటు మంత్రిగారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు దూలం శ్రీనివాస్, సంకె రవి, గోమాస ప్రకాష్ మరియు పలువురు కార్మికులు పాల్గొన్నారు