BREAKING
చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్లకు ₹76 లక్షల విరాళం – గోపాలపురంలో ఎమ్మెల్యే సందర్శన ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే పై కొత్త టోల్ పేమెంట్ ప్రారంభం మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన రఘునాథ్ ఆగిరిపల్లి మండలంలో కోడి పందాలపై దాడి – 14 మంది అరెస్ట్ నవోదయం 2.0 దాడి – నాటు సారా నిర్మూలనకు కఠిన చర్యలు చనుబండ గ్రామంలో శ్రీశ్రీశ్రీ మహా లక్ష్మమ్మ అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్తను పరామర్శించిన బాల్క సుమన్ స్మార్ట్ కిచెన్ సెంటర్లకు వ్యతిరేకంగా ఏఐసీసీటీయు ధర్నా వి.బి.జి. రాంజీ పథకంతో ఉపాధి కోల్పోయిన కార్మికులు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం సమర్పణ చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్లకు ₹76 లక్షల విరాళం – గోపాలపురంలో ఎమ్మెల్యే సందర్శన ఖమ్మం-దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవే పై కొత్త టోల్ పేమెంట్ ప్రారంభం మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ వైఖరిని ఖండించిన రఘునాథ్ ఆగిరిపల్లి మండలంలో కోడి పందాలపై దాడి – 14 మంది అరెస్ట్ నవోదయం 2.0 దాడి – నాటు సారా నిర్మూలనకు కఠిన చర్యలు చనుబండ గ్రామంలో శ్రీశ్రీశ్రీ మహా లక్ష్మమ్మ అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమం గాయపడ్డ బీఆర్ఎస్ కార్యకర్తను పరామర్శించిన బాల్క సుమన్ స్మార్ట్ కిచెన్ సెంటర్లకు వ్యతిరేకంగా ఏఐసీసీటీయు ధర్నా వి.బి.జి. రాంజీ పథకంతో ఉపాధి కోల్పోయిన కార్మికులు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం సమర్పణ
www.ntodaynews.com

​సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల ఆందోళన కలెక్టరేట్ ముట్టడి

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
20 Apr, 2026 - 05:38 PM
62 వీక్షణలు

​సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుల ఆందోళన: కలెక్టరేట్ ముట్టడి

మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట సింగరేణి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం భారీ ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ, మందమర్రి ఏరియాలో గత 12 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డులను సింగరేణి యాజమాన్యం కొత్త టెండర్లు పిలవకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల గత రెండు నెలలుగా కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే సుమారు వెయ్యి మంది కార్మిక కుటుంబాలు రోడ్డున పడటం దురదృష్టకరమని, తక్షణమే అధికారులు స్పందించి పాత పద్ధతిలోనే కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని, దీనికి సింగరేణి అధికారులతో పాటు మంత్రిగారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు దూలం శ్రీనివాస్, సంకె రవి, గోమాస ప్రకాష్ మరియు పలువురు కార్మికులు పాల్గొన్నారు