BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

సిపిఎం నేత బాబూరావుకు ఎన్నికల నోటీసులు.. ఎస్‌ఐఆర్‌పై తీవ్ర అభ్యంతరం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 09:27 PM
40 వీక్షణలు

సిపిఎం నేత బాబూరావుకు ఎన్నికల నోటీసులు.. ఎస్‌ఐఆర్‌పై తీవ్ర అభ్యంతరం

విజయవాడ: సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావుకు ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నాయంటూ ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు.

బాబూరావు మాట్లాడుతూ.. ఇప్పటికే రాష్ట్రంలో 45 లక్షల మంది ఓట్లను తొలగించిన తర్వాత, మరో 44 లక్షల మంది ఓటర్లకు వివిధ కారణాలతో నోటీసులు ఇవ్వడం ఆందోళనకరమన్నారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్ల హక్కులకు ముప్పు ఏర్పడేలా చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఎస్‌ఐఆర్‌లో భాగంగా తాను అవసరమైన అన్ని పత్రాలను సమర్పించానని తెలిపారు. 2002 ఓటర్ల జాబితాతో పోల్చిన తర్వాత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 117వ భాగంలో 467వ సీరియల్ నెంబర్ ఓటరుగా తన పేరును అధికారులు నమోదు చేశారని చెప్పారు. అయితే తన తండ్రి బాల నాగేశ్వరరావు పేరులో ఆంగ్ల అక్షరాల మార్పు ఉందంటూ మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారని తెలిపారు.

2002 జాబితాలో పేరు ఒక విధంగా నమోదు కాగా, ప్రస్తుతం మరో విధంగా నమోదు చేయడం ఎన్నికల అధికారుల తప్పిదమని బాబూరావు పేర్కొన్నారు. అధికారులు చేసిన తప్పులకు ఓటర్లను బాధ్యులను చేయడం సరికాదని విమర్శించారు.

ఓటు హక్కు కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి

ఎన్నికల జాబితాలో పేర్లు, వయస్సు, ఇతర వివరాల్లో లోపాలకు ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలని బాబూరావు డిమాండ్ చేశారు. ఓటర్లు సమర్పించిన ఆధారాల ప్రకారం తప్పులను సరిచేయాలని కోరారు.

ప్రస్తుతం విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో 1,37,297 మంది ఓటర్లకు నోటీసులు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. సాధారణ ప్రజలు, నిరక్షరాస్యులు పాత పత్రాలు సమర్పించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ఓటు హక్కు కల్పించడం ప్రభుత్వాలు, ఎన్నికల సంఘం బాధ్యత అని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరును ఓటర్ల జాబితాలో కొనసాగించాలని కోరారు.

ఎస్‌ఐఆర్‌ పేరుతో ఓట్ల తొలగింపు కుట్ర: బాబూరావు

కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్‌ పేరుతో కోట్లాది మంది ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నాయని బాబూరావు ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరిచే చర్యలు జరుగుతున్నాయని విమర్శించారు.

ఓటర్ల హక్కుల పరిరక్షణ కోసం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నికల అధికారులు జారీ చేసిన నోటీసులను ఉపసంహరించుకోవాలని, ఇంటింటికీ వెళ్లి వాస్తవ వివరాలను సేకరించి జాబితాలను సరిచేయాలని డిమాండ్ చేశారు.