స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన పూర్వ విద్యార్థులు
స్నేహితుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన పూర్వ విద్యార్థులు
యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1997-98వ సంవత్సరానికి చెందిన 10వ తరగతి చదువుకున్న తోటి మిత్రుడు పెద్ద పర్వతాపూర్ గ్రామానికి చెందిన బొడిగ ప్రభాకర్ అనారోగ్యంతో బాధపడుతూ కొద్ది రోజుల క్రితం మృతి చెందగా విషయం తెలుసుకున్న తోటి పూర్వ విద్యార్థులు ఆ కుటుంబానికి పరామర్శించి మనోధర్యాన్ని చెప్పి 50 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద పర్వతాపూర్ గ్రామ సర్పంచ్ ఈగల సంతోష బాల్ రాజు,ఉప సర్పంచ్ జింక నరేందర్, మిత్రులు శ్రీశైలం, గూదె బీరు మల్లయ్య, బండి శ్రీనివాస్, బాలరాజు, ఉట్ల రాజు, దాసరి నరేందర్ రెడ్డి, అశోక్, నరేష్, ప్రసాద్, లక్ష్మణ్, బిట్టు నారాయణ, బాసారం బాలయ్య, గూదే యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.