www.ntodaynews.com
ప్రతి పేదవాడి ఇంటికి సన్నబియం
తెలంగాణ
ప్రతి పేదవాడి ఇంటికి సన్నబియం
NTODAY NEWS: బొమ్మలరామారం, ఇప్పలపల్లి నరేందర్-ఏప్రిల్ 7
యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, బండకాడిపల్లి గ్రామంలో సోమవారం రోజున ప్రజా పాలనలో ప్రభుత్వ రేషన్ సన్న బియ్యం పంపిణీ పథకంలో భాగంగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ సీనియర్ నాయకులు సింగిరెడ్డి జితేందర్ రెడ్డి మాట్లాడుతూ పదేళ్లు గత ప్రభుత్వం దొడ్డు బియ్యమే ఇచ్చింది..ఇందిరమ్మ రాజ్యంలో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలేరు నియోజకవర్గ పేద ప్రజల కడుపు నింపడానికి ప్రజా పాలనలో ప్రభుత్వ రేషన్ సన్నబియ్యం పంపిణీ పథకంతో పేదవాడికి కడుపు నింపుకోవటమే కాదు..
సంపన్నులు తినే సన్నబియ్యం తింటున్నారు అని అన్నారు సన్నబియ్యంతో ఆలేరు నియోజకవర్గ పేద ప్రజల ఆకలి తీర్చిన ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి వర్గానికి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్యకి బొమ్మలరామారం మండలం, బండకాడపల్లి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బూడిద శ్రీనివాస్ గౌడ్, గుమ్మడి కరుణాకర్ రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి,చంద్రయ్య,రేషన్ డీలర్ దశరథ,గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube