సూరంపాలెం లో నక్కా రాము ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ శివారు సూరంపాలెం గౌడ బజార్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం
చాట్రాయి మండలం చనుబండ శివారు సూరంపాలెం గౌడ బజార్లో శనివారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజలకు అందుతున్న పథకాలు, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము, బూత్ కన్వీనర్ దార్ల సురేష్ కుమార్తో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నక్కా రాము మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేస్తున్నారని తెలిపారు.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నక్కా రాము కోరారు. రానున్న రోజుల్లో గ్రామాల అభివృద్ధికి మరింత కృషి చేస్తామని తెలిపారు.