www.ntodaynews.com
సూరంపాలెంలో ఘనంగా సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట ఉత్సవం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఘనంగా సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట ఉత్సవం
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చనుబండ గ్రామ పంచాయతీ శివారు సూరంపాలెం గ్రామంలో ఉన్న సంతాన వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవంలో వేద పండితులు అరిగే సోమాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఉత్సవం సందర్భంగా ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయాయి. నిర్వాహకులు భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించారు.