www.ntodaynews.com
స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి: ఎస్ఈసీ
ఆంధ్రప్రదేశ్
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని శాఖలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సూచించారు. ఓటర్ జాబితాలు సిద్ధమయ్యాయని తెలిపారు. నోటిఫికేషన్ విడుదలకు ముందే వాటిని పూర్తిగా అప్డేట్ చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తూ, కాకినాడ, శ్రీకాకుళం జిల్లాల్లో జరుగుతున్న ప్రక్రియలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.