BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి: నారా లోకేష్ పిలుపు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Aug, 2026 - 06:34 AM
34 వీక్షణలు

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి: నారా లోకేష్ పిలుపు

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు.

పంచాయతీ నుంచి ఢిల్లీ వరకు కూటమి ప్రభుత్వం కొనసాగితే రాష్ట్ర అభివృద్ధి మరింత వేగంగా ముందుకు సాగుతుందని నారా లోకేష్ పేర్కొన్నారు. కూటమి ఐక్యతను దెబ్బతీసేందుకు జరిగే కుట్రలను సమష్టిగా ఎదుర్కోవాలని కార్యకర్తలకు సూచించారు.

అధికారం ఉందనే అహంకారం లేకుండా ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యుల్లా కలిసికట్టుగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని అన్నారు.

పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం తప్పకుండా లభిస్తుందని నారా లోకేష్ భరోసా ఇచ్చారు.