స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి: నారా లోకేష్ పిలుపు
స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి: నారా లోకేష్ పిలుపు
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు.
పంచాయతీ నుంచి ఢిల్లీ వరకు కూటమి ప్రభుత్వం కొనసాగితే రాష్ట్ర అభివృద్ధి మరింత వేగంగా ముందుకు సాగుతుందని నారా లోకేష్ పేర్కొన్నారు. కూటమి ఐక్యతను దెబ్బతీసేందుకు జరిగే కుట్రలను సమష్టిగా ఎదుర్కోవాలని కార్యకర్తలకు సూచించారు.
అధికారం ఉందనే అహంకారం లేకుండా ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యుల్లా కలిసికట్టుగా పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేయాలని అన్నారు.
పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం తప్పకుండా లభిస్తుందని నారా లోకేష్ భరోసా ఇచ్చారు.