www.ntodaynews.com
విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సేవా సప్తాహం కార్యక్రమం
తెలంగాణ
విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సేవా సప్తాహం కార్యక్రమం
NTODAY NEWS
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో సేవా సప్తాహం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పలు ప్రాంతాలలో మొక్కలను నాటడం ఈ సందర్భంగా బజరంగ్దళ్ నాయకులు మాట్లాడుతూ హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడంలో బజరంగ్దళ్ ఎప్పుడు ముందుంటుందని, గో సంరక్షణ ముఖ్య ద్యేయంగా పనిచేస్తున్నామని, మొక్కలు నాటడం వల్ల ప్రకృతినీ కాలుష్యం నుండి కాపాడవచ్చు అని తెలియజేశారు. అంతేకాకుండా చౌటుప్పల్ ప్రాంతంలో రసాయన పరిశ్రమల ద్వారా కాలుష్యం ఎక్కువ అవుతుందని, వీటిని నివారించడానికి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని బజరంగ్దళ్ కార్యకర్తలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో బజరంగ్ దళ్ జిల్లా సహా సంయోజక్ గోగు రవి మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్యకర్త కూడా వృక్ష సంపదను కాపాడాలని, మొక్కలు నాటడం అనేది పర్యావరణానికి ఎంతో మేలు చేసే ఒక ముఖ్యమైన కార్యక్రమం. అంతేకాకుండా, ఇవి భూమిని సారవంతం చేస్తాయి మరియు వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి. కాబట్టి, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం మరియు వాటిని సంరక్షించడం అలవాటు చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ జిల్లా సహా సంయోజక్ గోగు రవి, బాలాజీ దేవాలయ కమిటీ సంతోష్ పంతులు, ఊదరి శ్యామ్, తూర్పునూరి నరసింహ, ,చెవ్వ గోని మహేష్ మరియు పాక చిరంజీవి,రవి గౌడ్ వివేక్,యువరాజు, హేమంత్,ఉదయ్, అఖిల్, నరేష్, బజరంగ్ దళ్ కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube