BREAKING
ఇల్లు కోల్పోయాం.. ఉపాధి కోల్పోయాం... నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నాం నాగోల్ డివిజన్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవ్ రెడ్డి సుదీర్ తో కలిసి జోనల్ కమిషనర్ పర్యటన సర్వే నెంబర్ 255/1 లో గల మాదిగల భూములు మాదిగలకే కేటాయించాలి. ఈనెల 23 నుంచి జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక బందును జయప్రదం చేయండి సిఐటియు ఎల్కతుర్తి, రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని హింగే భాస్కర్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి ఇల్లు కోల్పోయాం.. ఉపాధి కోల్పోయాం... నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్నాం నాగోల్ డివిజన్లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవ్ రెడ్డి సుదీర్ తో కలిసి జోనల్ కమిషనర్ పర్యటన సర్వే నెంబర్ 255/1 లో గల మాదిగల భూములు మాదిగలకే కేటాయించాలి. ఈనెల 23 నుంచి జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక బందును జయప్రదం చేయండి సిఐటియు ఎల్కతుర్తి, రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలని హింగే భాస్కర్ రొంపిచర్లలో ఘనంగా జాతీయ జెండా ప్రదర్శన జనసేన పార్టీ కమిటీలు నేడు సాయంత్రం 5 గంటలకు విడుదల వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి
www.ntodaynews.com

శాకాంబరీ దేవిగా చిట్యాల కనకదుర్గమ్మ

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
14 Aug, 2026 - 08:06 PM
35 వీక్షణలు

శాకాంబరీ దేవిగా చిట్యాల కనకదుర్గమ్మ 

ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం 

 శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా నల్గొండ జిల్లా  చిట్యాల పట్టణంలోని శ్రీశ్రీశ్రీ కనకదుర్గ దేవాలయంలో అమ్మవారిని శాకాంబరీ దేవిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్యఅతిథిగా  ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీ సమేతంగా పాల్గొన్నారు ఆలయ చైర్మన్ మారగోని ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో అర్చకులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం, గణపతి పూజ, మండపారాధన, గోపూజ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయానికి చేరుకుని అమ్మవారికి వడి బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ అమ్మవారి కృపాకటాక్షాలు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. శ్రావణమాస ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తున్న ఆలయ చైర్మన్, డైరెక్టర్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీత రమేష్, వైస్ చైర్‌పర్సన్ గుండెబోయిన శ్రీలక్ష్మి సైదులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ప్రధాన అర్చకులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎద్దులపురి కృష్ణ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జడల చిన్నమల్లయ్య యాదవ్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు వనమా వెంకటేశ్వర్లు, ఆలయ కమిటీ డైరెక్టర్లు గంజి వెంకటేశం, బుద్ధ విమల కృష్ణమూర్తి, వరకాంతం నరసింహారెడ్డి, రుద్రారపు లింగయ్య, జిట్ట సాయిలు, బెలిదే సత్యనారాయణ, ఆలయ అధికారి ఏనుగు నరసింహారెడ్డితో పాటు పలువురు నాయకులు, భక్తులు, పట్టణ ప్రముఖులు, సేవకులు పాల్గొన్నారు.