శాంతియుత వాతావరణంలో బక్రీద్..
శాంతియుత వాతావరణంలో బక్రీద్.. అన్నమయ్య జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత..
అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్
మదనపల్లి, మే
త్యాగానికి, సహనానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను శాంతి సామరస్యాలతో, అత్యంత వైభవంగా జరుపుకోవాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు ఆకాంక్షించారు.
బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిందని ఎస్పీ గారు వెల్లడించారు. పండుగ వేళ శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని జిల్లాలోని పోలీస్ అధికారులను సిబ్బందిని ఆయన ఆదేశించారు.
జిల్లాలోని ప్రధాన మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశామని, ముఖ్యంగా సున్నిత ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు ఎస్పీ తెలిపారు. సామాజిక మాధ్యమాలపై పోలీస్ శాఖ ప్రత్యేక పర్యవేక్షణ ఉంచిందని, విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
జారీ చేసిన వారు:
పీఆర్వో, అన్నమయ్య జిల్లా పోలీస్.