BREAKING
​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం
www.ntodaynews.com

షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో రూ. 54 లక్షల మోసం

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
ANNAPAREDDY SIVA NAGENDRA గుంటూరు టౌన్ రిపోర్టర్
17 Jun, 2026 - 11:47 AM
13 వీక్షణలు

గుంటూరులో షేర్ మార్కెట్‌లో భారీ లాభాలు వస్తాయని ఆశ చూపించి ఓ హాస్టల్ యజమాని నుంచి రూ.54 లక్షలు కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నగరంలో చర్చనీయాంశంగా మారింది.

పోలీసుల వివరాల ప్రకారం, గుంటూరు బ్రాడీపేటకు చెందిన కోటేశ్వరరావు హాస్టల్ నిర్వహిస్తున్నారు. ఆయన వద్ద సూపర్వైజర్‌గా పనిచేస్తున్న రామిరెడ్డి, తన స్నేహితుడు గోపీతో కలిసి తమకు షేర్ మార్కెట్‌పై మంచి అనుభవం, అవగాహన ఉందని నమ్మించారు.

షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని చెప్పి విడతల వారీగా కోటేశ్వరరావు నుంచి మొత్తం రూ.54 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. అయితే నెలలు గడిచినా లాభాలు ఇవ్వకపోవడంతో పాటు పెట్టిన అసలు పెట్టుబడిని కూడా తిరిగి చెల్లించలేదు.

దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు అరండల్‌పేట పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల నుంచి డబ్బులు ఎలా సేకరించారు, ఎక్కడ పెట్టుబడి పెట్టారు అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.