www.ntodaynews.com
శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత.. రూ.3.36 కోట్ల గోల్డ్ సీజ్!
తెలంగాణ
హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కౌలాలంపూర్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద రూ.3.36 కోట్ల విలువైన 2.271 కిలోల 24 క్యారెట్ల బంగారాన్ని అధికారులు గుర్తించారు.
దర్యాప్తులో, నిందితులు ప్యాంటు నడుము భాగంలో ప్రత్యేకంగా కుట్టిన పౌచ్లలో బంగారాన్ని పేస్ట్ రూపంలో దాచి అక్రమంగా తరలిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. జూన్ 24న జరిగిన ఈ తనిఖీల్లో బంగారాన్ని సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు ఇద్దరినీ అరెస్టు చేసి, కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
అంతర్జాతీయ మార్గాల ద్వారా బంగారం అక్రమ రవాణాపై కస్టమ్స్ అధికారులు నిఘాను మరింత కట్టుదిట్టం చేశారు.