శ్రీ బోయకొండ గంగమ్మను దర్శించుకున్న కర్ణాటక హైకోర్టు జడ్జి...
శ్రీ బోయకొండ గంగమ్మను దర్శించుకున్న కర్ణాటక హైకోర్టు జడ్జి...
అన్నమయ్య జిల్లా.
చౌడేపల్లి.
జస్టిస్ రాశిరెడ్డికి ఘన స్వాగతం – దుశ్శాలువతో సత్కరించిన ఆలయ అధికారులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం దిగువపల్లిలో వెలసిన శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానాన్ని కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ రాశిరెడ్డి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ అధికారులు జస్టిస్ రాశిరెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న ఆమెకు ఆలయ ఈఓ, ఉపకమిషనర్ ఏకాంబరం దుశ్శాలువతో సత్కరించారు.
అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు ఆమెకు ఆలయ విశిష్టత, చారిత్రక ప్రాధాన్యత తదితర వివరాలను వివరించారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పుంగనూరు పట్టణ అధ్యక్షులు జగదీష్ రాజు పాల్గొన్నారు. ఆలయ సిబ్బంది, భక్తులు తదితరులు జస్టిస్ రాశిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.