శ్రీ వెంకటేశ్వర స్వామికి పసుపు, కుంకుమ అర్చనలు – పూలతో ప్రత్యేక అలంకరణ...
శ్రీ వెంకటేశ్వర స్వామికి పసుపు, కుంకుమ అర్చనలు – పూలతో ప్రత్యేక అలంకరణ...
అన్నమయ్య జిల్లా,
పుంగనూరు.
పుంగనూరులో ఘనంగా పవిత్రోత్సవాలు
శ్రీ వెంకటేశ్వర స్వామికి పసుపు, కుంకుమ అర్చనలు – పూలతో ప్రత్యేక అలంకరణ
పుంగనూరు: పుంగనూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పవిత్రోత్సవాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు, పసుపు–కుంకుమ అర్చనలు నిర్వహించారు.
అనంతరం స్వామివారిని వివిధ రకాల పూలతో అత్యంత సుందరంగా అలంకరించారు. పూల అలంకరణలో కొలువుదీరిన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.