శ్రీనివాస్ సెంటర్ టు సంజీవనగర్ గేట్ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ... మంత్రి ఎన్ఎండి ఫరూక్
శ్రీనివాస్ సెంటర్ టు సంజీవనగర్ గేట్ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ... మంత్రి ఎన్ఎండి ఫరూక్
నంద్యాల,
నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్ టు సంజీవనగర్ గేట్ వరకు జరుగుతున్న రోడ్డు అభివృద్ధి పనులను రాష్ట్ర మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ శనివారం స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లతో మాట్లాడి పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మంత్రి ఫరూక్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఒకటైన శ్రీనివాస్ సెంటర్ టు సంజీవనగర్ గేట్ వరకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా రోడ్డు పనులను అత్యంత నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనులు జరుగుతున్న సమయంలో వాహనదారులకు, స్థానిక ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా రోడ్డు విస్తరణ మరియు అభివృద్ధి పనులను ముగించాలని తెలిపారు. నిర్మాణ సమయంలో దుమ్ము, ట్రాఫిక్ మళ్లింపు వంటి విషయాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. రోడ్డు నిర్మాణంలో ఎక్కడా రాజీ పడకుండా అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలన్నారు
ఈ కార్యక్రమంలో మంత్రి వెంట స్థానిక నాయకులు, సంబంధిత శాఖల అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.