www.ntodaynews.com
శ్రీరామవరం గ్రామంలో కోడిపందెంపై పోలీసుల దాడి..అదుపులో ఏడుగురు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
శ్రీరామవరం గ్రామంలో కోడిపందెంపై పోలీసుల దాడి..అదుపులో ఏడుగురు
ఏలూరు జిల్లా టి.నరసాపురం మండలం శ్రీరామవరం గ్రామంలో శనివారం నిర్వహిస్తున్న కోడిపందెంపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో కోడిపందెం నిర్వహిస్తున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.37 వేల నగదు, రెండు మోటార్ సైకిళ్లు, ఒక కోడి కత్తి, ఒక కోడిపుంజు, ఏడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు టి.నరసాపురం ఎస్ఐ జయ బాబు వెల్లడించారు.