www.ntodaynews.com
శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి మొదటి వార్షికోత్సవం
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
NTODAY NEWS :-రిపోర్టర్ (వీరమల్ల శ్రీను) ఏలూరు జిల్లా/జీలుగుమిల్లి మండలం/రాచన్నగూడెం గ్రామం దేవత శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మరియు ఆలయంలో గ్రామస్తుల సహాయంతో అన్న సమారాధన కార్యక్రమం ఆలయ కమిటీ వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ ముత్యాలమ్మ తల్లి ఆలయం నిర్మించి నేటికీ ఏడాది కావస్తుందని ఈ సందర్భంగా మొదటి వార్షిక మహోత్సవం జరుపుకుంటున్నామని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించామని మరియు గ్రామస్తుల సహాయంతో అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు గ్రామంలోని ప్రజలపై కలిగి సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.