BREAKING
యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు యోగాంధ్ర కార్యక్రమాల విజయవంత నిర్వహణకు శ్రీశైలం దేవస్థానం ప్రణాళిక బీటెక్ విద్యార్థి కిడ్నాప్ కలకలం.. చివరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో భారీ చోరీ. హోంమంత్రిపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదు: ఆగివున్న లారీని ఢీకొట్టిన మినీ బస్సు .. ఒకరు మృతి, 13 మందికి గాయాలు! మార్కాపురంలో రేషన్ బియ్యం మాఫియాకు భారీ షాక్.. 1922 కేజీల బియ్యం సీజ్! అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు.... ట్రాక్టర్లకు రేడియం స్టిక్కర్లు.. రహదారి ప్రమాదాల నివారణకు నూజివీడు పోలీసుల ప్రత్యేక చర్య పుంగనూరులో తల్లిపై కుమారుడి కర్రలతో దాడి పల్లె నిద్రలో ప్రజలతో మమేకమైన ఆగిరిపల్లి పోలీసులు
www.ntodaynews.com

శ్రమజీవుల హక్కుల కోసం పోరాడిన ఆదర్శ కమ్యూనిస్టు ఆముదాల తిరుపతయ్య: వేముల ఒక్కయ్య

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 03:28 PM
23 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరు, జూన్ 3: శ్రమజీవుల హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేసిన ఆదర్శ కమ్యూనిస్టు నాయకుడు ఆముదాల తిరుపతయ్య అని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వేముల ఒక్కయ్య పేర్కొన్నారు. ముసునూరు మండలం రమణక్కపేట గ్రామంలో ఆముదాల తిరుపతయ్య ఆరవ వర్ధంతి సందర్భంగా మాజీ సర్పంచ్ బోకినాల కాంతకుమారి అధ్యక్షతన నివాళి సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా వేముల ఒక్కయ్య మాట్లాడుతూ, “చదువు – చదివించు” అనే నినాదంతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి తిరుపతయ్య విశేష కృషి చేశారని తెలిపారు. ఆయన స్థాపించిన ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులను నిరంతరం ప్రోత్సహిస్తూ, విద్యా వికాసానికి తోడ్పాటునందించారని అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం కృషి చేయడంతో పాటు యువత రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించారని గుర్తు చేశారు. వామపక్ష శక్తుల ఐక్యత కోసం కూడా తిరుపతయ్య విశేషంగా శ్రమించారని వక్తలు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ బూత్ కమిటీ సభ్యుడు ఆముదాల నోబుల్ రాజు, వైఎస్సార్‌సీపీ నాయకులు ఎ. కృష్ణ, బి. వెంకటరత్నం, మహిళా సంఘం నాయకురాలు పల్లిపాం భవాని, సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ జిల్లా కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొని ఆముదాల తిరుపతయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అభ్యున్నతి కోసం యువత రాజకీయాల్లోకి రావాలి అనే ఆశయంతో పనిచేసిన కామ్రేడ్ ఆముదాల తిరుపతయ్య సేవలను ఈ సందర్భంగా పలువురు స్మరించుకున్నారు.