BREAKING
ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు ఏపీలో కొత్తగా 5,606 మందికి వితంతు పెన్షన్లు.. జూన్ నుంచే అమలు అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు
www.ntodaynews.com

ఐదు రోజుల్లోనే భారీ పతనం

తెలంగాణ
02 Feb, 2026 - 10:22 PM
288 వీక్షణలు
వెండి ధరలు కరిగిపోతున్నాయి.. ఐదు రోజుల్లోనే భారీ పతనం NTODAY NEWS: ప్రత్యేక కథనం కిలో వెండి ధర రూ.1.88 లక్షలు తగ్గింపు.. ఇన్వెస్టర్లకు అలర్ట్! వెండి ధరలు ఒక్కసారిగా భారీగా క్షీణించాయి. ఫిబ్రవరి 3వ తేదీ, మంగళవారం నాటి తాజా ధరల ప్రకారం దేశీయ మార్కెట్లో ఒక కిలో వెండి ధర రూ.2,47,488గా నమోదైంది. నిన్నటితో పోలిస్తే నేడు వెండి ధర రూ.17,031 తగ్గినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతోనే వెండి ధరల్లో ఈ స్థాయి పతనం చోటుచేసుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ వెండి ధర ఒక దశలో 120 డాలర్ల వరకు చేరగా, కేవలం ఐదు రోజుల్లోనే అది 75 డాలర్లకు పడిపోయింది. అంటే సుమారు 50 డాలర్ల తగ్గుదల నమోదైందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది దాదాపు 40 శాతం వరకు తగ్గుదలగా అంచనా వేయబడుతోంది. ఆల్‌టైమ్ రికార్డు స్థాయిని పరిశీలిస్తే, గతంలో ఒక దశలో కిలో వెండి ధర రూ.4.25 లక్షల వరకు వెళ్లినట్లు మార్కెట్ గణాంకాలు సూచిస్తున్నాయి. అయితే అక్కడి నుంచి వరుసగా తగ్గుతూ ప్రస్తుతం రూ.2.47 లక్షల స్థాయికి చేరింది. అంటే మొత్తం మీద వెండి ధర దాదాపు రూ.1.88 లక్షలు పతనమైనట్లు స్పష్టమవుతోంది. ఈ నేపథ్యంలో వెండిలో పెట్టుబడి పెట్టాలనుకునే ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, డాలర్ మార్పిడి విలువలు, కమోడిటీ మార్కెట్ ఒడిదుడుకులే ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే మరోవైపు వెండి ధరలు తగ్గడం ఫిజికల్ వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరట కలిగించే అంశంగా మారింది. ముఖ్యంగా భారతీయులలో వివాహాది శుభకార్యాలు, పూజా కార్యక్రమాల కోసం వెండి వస్తువులు కొనుగోలు చేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తగ్గుతున్న వెండి ధరలు సామాన్య వినియోగదారులకు కొంతమేర ఉపశమనాన్ని కలిగిస్తున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. మొత్తంగా చూస్తే, వెండి ధరల్లో కొనసాగుతున్న ఈ భారీ ఊగిసలాట పెట్టుబడిదారులకు హెచ్చరికగా మారగా, వినియోగదారులకు మాత్రం కొంత అనుకూలంగా మారిందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. Follow us on Website Facebook Instagram YouTube