www.ntodaynews.com
వైభవంగా శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవం
తెలంగాణ
గుళ్ళకోటలో వైభవంగా శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవం
NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్
ఎడ్లబండ్ల పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు, PACS మాజీ చైర్మన్ మద్ధుల గోపాల్ రెడ్డి
వెల్గటూర్ మండలంలోని గుళ్ళకోట గ్రామంలో జరిగిన శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు, PACS మాజీ చైర్మన్ మద్ధుల గోపాల్ రెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
జాతర సందర్భంగా నిర్వహించిన ఎడ్లబండ్ల పోటీలు గ్రామస్తులు మరియు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి మద్ధుల గోపాల్ రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ క్రీడలు మరియు సంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గొల్లపల్లి మల్లేశం, బీసగోని సత్యం, గొల్లపల్లి సత్యం, సత్యనారాయణ (గౌరీ), కందికట్ల రాజేష్, బెడ్డల ప్రవీణ్, బాలసాని మల్లేశం, ధర్శనాల నరేష్, కొడిపెల్లి శ్రీనివాస్, నీలం శ్రీనివాస్, మెరుగు నరేష్, గుమ్ముల వెంకటేష్, సింగతి వెంకటస్వామి తదితరులతో పాటు వెల్గటూర్ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
#Velgatoor #Gullakota #VenugopalaSwamy #Rathotsavam #BullockCartRace #CongressLeaders #TelanganaNews #NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube