ఉరుమడ్లలో వినాయకుడికి ఎస్సై వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు
తెలంగాణ
చిట్యాల, సెప్టెంబర్ 19, Ntoday న్యూస్: నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని న్యూ ముత్యాలమ్మ ఆలయం వద్ద వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిట్యాల మండల ఎస్సై వెంకట్ రెడ్డి వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాలకు చెందిన వారు పూజా కార్యక్రమంలో పాల్గొని వినాయకుడిని దర్శించుకున్నారు. గ్రామంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకలు నిర్వహించారు.
కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ మర్రి రమేష్, 8వ వార్డు మెంబర్ మందుగుల పార్వతమ్మ, రొయ్య యాదమ్మ, మర్రి మాధవి, మర్రి రాంబాబు, మర్రి మహేశ్వరి, నరేష్, మర్రి కిరణ్, మందుగుల దీపిక, మర్రి పారిజాత, రొయ్య సందీప్, రొయ్య అజయ్, మర్రి మహేష్, మర్రి అశోక్, ఈదుల సరిత, రొయ్య కమలమ్మ, మందుగుల లలిత తదితరులు పాల్గొన్నారు.