www.ntodaynews.com
SSC–2026లో ప్రతిభ జ్యోతి… మైదుకూరు విద్యార్థిని ఘన విజయం
ఆంధ్రప్రదేశ్
SSC–2026లో ప్రతిభ జ్యోతి… మైదుకూరు విద్యార్థిని ఘన విజయం
SSC–2026 ఫలితాల్లో మైదుకూరు మండలం జడ్పీహెచ్ఎస్ శెట్టివారిపల్లెకు చెందిన విద్యార్థిని పసల వీర ఉదయశ్రీ 592 మార్కులు సాధించి అద్భుత ప్రతిభ కనబర్చింది. ఈ సందర్భంగా ఆమెకు హృదయపూర్వక శుభాకాంక్షలు
పాఠశాలలో నిర్వహించిన మాక్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పాత్ర పోషిస్తూ గిరిజన తండాల సమస్యలపై తన గళాన్ని ధైర్యంగా వినిపించిన ఉదయశ్రీ, చదువుతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కలిగి ఉన్న ప్రతిభావంతురాలిగా నిలిచింది.
పదవ తరగతి ఫలితాల్లో 592 మార్కులు సాధించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా ప్రైవేట్ విద్యా సంస్థలకు ఏమాత్రం తీసిపోరని ఆమె మరోసారి నిరూపించింది. ఆమె సాధించిన ఈ విజయం మైదుకూరు మండలానికి గర్వకారణం.