BREAKING
thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం thumb లద్దిగంలో ఘనంగా గణేష్ నిమజ్జనం.. రూ.61 వేలకు లడ్డూ వేలం thumb MGM ఆసుపత్రిలో పైకప్పు ఊడి ముగ్గురికి గాయాలు thumb ప్రతి రైతుకు ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలి thumb రొంపిచర్లలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు.. thumb డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం.. వీధిలో మురుగు నీరు thumb పులివెందులలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. భారీ ధరలకు లడ్డూలు thumb పులివెందులలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఆశలు thumb ఆళ్లగడ్డలో ఉరుములు, మెరుపులతో వర్షం.. రైతుల్లో ఊరట thumb చిట్టిరెడ్డిపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం! thumb కొల్లి బాలు మృతికి చిర్ల జగ్గిరెడ్డి సంతాపం
Date of Publish : 19 September 2026, 06:44 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

లక్ష్మీపురం విద్యుత్ ఉపకేంద్రాన్ని సందర్శించిన విద్యార్థులు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Sep, 2026 - 06:44 PM
29 వీక్షణలు

తిరువూరు: ప్రభుత్వ ఉన్నత పాఠశాల, తిరువూరు ఆధ్వర్యంలో వృత్తి విద్య–ఆటోమోటివ్ ట్రేడ్‌లో భాగంగా 9, 10వ తరగతి విద్యార్థులకు శనివారం లక్ష్మీపురం విద్యుత్ ఉపకేంద్రంలో పారిశ్రామిక సందర్శన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు విద్యుత్ ఉపకేంద్రంలో 11 కేవీ, 33 కేవీ విద్యుత్ లైన్ల నిర్వహణ, ట్రాన్స్‌ఫార్మర్ల పనితీరు, విద్యుత్ పంపిణీ విధానం, భద్రతా ప్రమాణాలు, సాంకేతిక ప్రక్రియలను ప్రత్యక్షంగా పరిశీలించారు. తరగతి గదిలో నేర్చుకున్న విద్యుత్ సంబంధిత అంశాలను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా చూడటంతో విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన ఏర్పడింది.

అలాగే సాంకేతిక, వృత్తి విద్యను అభ్యసించడం ద్వారా విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో అందుబాటులో ఉన్న ఉపాధి, వృత్తి అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యుత్ పరికరాల నిర్వహణలో పాటించాల్సిన భద్రతా చర్యలను కూడా వివరించారు.

ఈ కార్యక్రమానికి తిరువూరు టౌన్ ఎలక్ట్రికల్ ఏఈ రాజ్‌కుమార్, జూనియర్ ఇంజనీర్ కుశ్వత్ మార్గదర్శకత్వం, సహకారం అందించారు. విద్యార్థులకు విద్యుత్ ఉపకేంద్రంలో జరుగుతున్న పనితీరును వివరించి, సాంకేతిక అంశాలపై అవగాహన కల్పించారు.

విద్యార్థులకు వాస్తవ పని విధానాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈ పారిశ్రామిక సందర్శన ఎంతో ఉపయోగకరంగా నిలిచిందని తిరువూరు ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ కే. సిద్ధయ్య పేర్కొన్నారు. ఇటువంటి క్షేత్రస్థాయి కార్యక్రమాలు విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించడంతో పాటు భవిష్యత్ విద్య, ఉపాధి అవకాశాలపై స్పష్టత కల్పిస్తాయని తెలిపారు.

లక్ష్మీపురం విద్యుత్ ఉపకేంద్ర సందర్శన విద్యార్థులకు ప్రాయోగిక జ్ఞానాన్ని అందించడంతో పాటు సాంకేతిక రంగంపై ఆసక్తిని పెంపొందించేలా ఉపయోగకరంగా నిలిచింది.