www.ntodaynews.com
ఘనంగా సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం
తెలంగాణ
ఘనంగా సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం
NTODAY NEWS: నార్కెట్ పల్లినల్గొండ జిల్లా: నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు గ్రామంలో బుధవారం రోజున శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల సుఖ సంతోషాల కోసం ప్రత్యేక సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రం చెరువుగట్టులో ఈ కళ్యాణం నిర్వహిస్తున్నామని తెలియజేశారు స్వామివారి కల్యాణ అనంతరం అన్న ప్రసాదం వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కళ్యాణ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి మాలదారులు, భక్తులు, అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు.
Follow us on Website Facebook Instagram YouTube