www.ntodaynews.com
నిరుపేద కుటుంబాన్ని ఆదుకోండి
తెలంగాణ
ప్రాణాపాయంలో తల్లి.. నిరుపేద కుటుంబాన్ని ఆదుకోండి
NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్
రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు.. చికిత్సకు రూ.15 లక్షలు అవసరం
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన చెవులమద్ది తిరుమల (భర్త నరేష్) ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో ఆమె మెడ భాగంలోని వెన్నుపూస విరిగిపోవడంతో ప్రస్తుతం కరీంనగర్లోని చెల్మెడ ఆనందరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.
అదే ప్రమాదంలో ఆమె పెద్ద కుమార్తెకు కూడా చేయి విరిగి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ బాలిక జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
కుటుంబ పరిస్థితి దయనీయం
తిరుమల భర్త నరేష్ కూడా ఆరు నెలల క్రితం జరిగిన మరో ప్రమాదంలో కాలు విరిగి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ముగ్గురు ఆడపిల్లలున్న ఈ కుటుంబానికి తిరుమలే ప్రధాన ఆదారంగా ఉండేది.
ఇప్పుడు ఆమెకు తక్షణం శస్త్రచికిత్స చేయకపోతే ప్రాణాపాయం ఉందని వైద్యులు తెలిపారు. ఈ చికిత్సకు సుమారు రూ.15 లక్షల వరకు ఖర్చవుతుందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆర్థికంగా బలహీనమైన ఈ కుటుంబం అంత పెద్ద మొత్తాన్ని భరించే పరిస్థితిలో లేదు.
మానవతా దృక్పథంతో దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.
సహాయం చేయాలనుకునే వారు
PhonePe / Google Pay: 7893948403
Account Name: Elkaturi Aruna
చిరునామా: గొల్లపల్లి మండల కేంద్రం, జగిత్యాల జిల్లా
#HelpNeeded #MedicalEmergency #Jagtial #Gollapalli #SupportPoorFamily #DonateForTreatment #Humanity #NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube