BREAKING
వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య
www.ntodaynews.com

టీడీపీ ప్రభుత్వ వెన్నుపోటు పాలనకు నిరసనగా వైఎస్సార్‌సీపీ ఉద్యమ బాట

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 05:39 PM
74 వీక్షణలు

మాజీ శాసనసభ్యులు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు 

గడిచిన రెండేళ్లలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ, ఈ నెల 4న రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను నూజివీడు పట్టణంలోని ద్వారకా సెంటర్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే కార్యాలయంలో నూజివీడు మాజీ శాసనసభ్యుడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయకుండా మోసం చేసిందని విమర్శించారు. సూపర్ సిక్స్ సహా పలు కీలక హామీలు నేటికీ అమలుకు నోచుకోలేదని, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందని ఆరోపించారు.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న "వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నూజివీడు నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కోరారు.