టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభలను జయప్రదం చేయండి : ఏళ్ల బయన్న పిలుపు
జూన్ 3న నకరికల్ పట్టణ కేంద్రంలో జరిగే టియుడబ్ల్యూజే (ఐజేయు) నలగొండ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ఆ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు ఏళ్ల బయన్న పిలుపునిచ్చారు. ఆదివారం చిట్యాల పట్టణ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించేందుకు కృషి చేయడంలో టియుడబ్ల్యుజె ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులతో పాటు ఎన్నో ఏళ్లుగా అపరిస్కృతంగా ఉన్న ఇంటి స్థలాలు, ఇండ్లు ఇప్పించేందుకు ఇప్పటికే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించెందుకు కృషి చేసిందన్నారు. జర్నలిస్టుల సమస్యలపై స్పందించిన ప్రభుత్వం త్వరలోనే ఇళ్ల ప్లాట్లను, ఇళ్ల నిర్మాణం లు చేపట్టబోతుందన్నారు. అలాగే జర్నలిస్టు కుటుంబ సభ్యులందరికీ హెల్త్ కార్డుల ద్వారా ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవలు, ఉచిత విద్య అందేలా కృషి చేస్తుందన్నారు. నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో నీ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలను ఇప్పిచ్చేందుకు స్థానిక ఎమ్మెల్యే సహకారంతో కృషి చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో యూనియన్ అధ్యక్షుడు మెండే వెంకన్న, కార్యదర్శి పోకల కరుణాకర్, మిర్యాల ప్రకాష్, సురేపల్లి సూర్యనారాయణ, జిట్ట మల్లేష్, అమరోజు వెంకన్న, చికిలంమెట్ల మెహర్ బాబు తదితరులు పాల్గొన్నారు..