BREAKING
అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు రైతులకు సాగునీరు, త్రాగునీరు కోసం తగ్గేదేలా అంటున్న YSRCP నంద్యాల జిల్లా మాజీ MLA లు శిల్పా & sons తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు రైతులకు సాగునీరు, త్రాగునీరు కోసం తగ్గేదేలా అంటున్న YSRCP నంద్యాల జిల్లా మాజీ MLA లు శిల్పా & sons తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష
Date of Publish : 02 September 2026, 10:32 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

టోలిచౌకి ఎస్సై రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Sep, 2026 - 10:32 AM
10 వీక్షణలు

హైదరాబాద్: కేసు నమోదు చేయకుండా, పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు రూ.10 వేల లంచం డిమాండ్ చేసిన టోలిచౌకి ఎస్సై ఆర్. పాండు ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

ఓ కేసు విషయంలో బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదును స్వీకరించిన సిటీ రేంజ్–1 ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వల పన్నారు. ఈ క్రమంలో ఎస్సై ఆర్. పాండు రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అక్కడికి చేరుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

కేసు నమోదు చేయకుండా ఉండటంతో పాటు పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకోకుండా చర్యలు తీసుకునేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు అధికారులు తెలిపారు. లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ చేపట్టారు.

ఎస్సైపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. నిందితుడిని నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటన పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.