ట్రంప్ ప్రభుత్వంనకు మళ్లీ షాక్
ట్రంప్ ప్రభుత్వంనకు మళ్లీ షాక్
అమెరికాలో జన్మించిన పిల్లల పాస్పోర్ట్ దరఖాస్తు నిబంధనలను ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేస్తోంది. ఇకపై పిల్లలకు పాస్పోర్ట్ పొందేందుకు తల్లిదండ్రులు తమ పౌరసత్వం లేదా చట్టబద్ధమైన ఇమ్మిగ్రేషన్ హోదాకు సంబంధించిన ఆధారాలను సమర్పించడం తప్పనిసరి చేయనున్నారు. బర్త్ -రైట్ సిటిజన్ షిప్, 'బర్త్ టూరిజం'ను అరికట్టడమే ఈ ముసాయిదా మార్గదర్శకాలను రూపొందించారు.
ఈ అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. విదేశీ వలసదారుల పిల్లలకు పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని నియంత్రించేలా, 'బర్త్ టూరిజం'ను నిషేధించే లక్ష్యంతో ఆయన జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు నిలిపివేసింది. ఈ ఉత్తర్వులు చట్టవిరుద్ధమని భావించిన న్యాయస్థానం వాటి అమలుపై స్టే విధించింది.