BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

తాడేపల్లి: రాఖీ వేళ అక్కచెల్లెమ్మలకు వైఎస్ జగన్ ప్రత్యేక శుభాకాంక్షలు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Aug, 2026 - 08:14 PM
16 వీక్షణలు

తాడేపల్లి, ఆగస్టు 27: రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలు, మహిళలు, చిన్నారులకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధనం కేవలం ఓ పండుగ మాత్రమే కాదని, అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమానురాగాలు, అనుబంధాలకు ప్రతీకగా నిలిచే పవిత్ర వేడుక అని పేర్కొన్నారు.

అక్కచెల్లెమ్మల జీవితాల్లో సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలు ఎల్లప్పుడూ వెల్లివిరియాలని ఆకాంక్షించారు. మహిళల సంక్షేమం, వారి అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలోని ప్రతి మహిళకు దేవుడి ఆశీస్సులు, చల్లని దీవెనలు ఎల్లకాలం ఉండాలని కోరుకుంటున్నట్లు వైఎస్ జగన్ తన రాఖీ సందేశంలో తెలిపారు. రాఖీ పండుగ సందర్భంగా ఆత్మీయత, అనుబంధాల విలువను గుర్తుచేస్తూ ఆయన చేసిన శుభాకాంక్షలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి.