తాడిపత్రి రుద్రభూమి అభివృద్ధి పనుల పరిశీలన
తాడిపత్రి రుద్రభూమి అభివృద్ధి పనుల పరిశీలన
నేడు తాడిపత్రి పట్టణంలోని రుద్రభూమిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తయ్యేలా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, వారికి బాధ్యతలు అప్పగించారు.
ఈ సందర్భంగా రుద్రభూమిలో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్లు, కాలభైరవ విగ్రహం, వసతి గదుల పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. అలాగే పచ్చదనం పెంపు (గ్రీనరీ) పనులను త్వరలో ప్రారంభించి, రెండు నెలల్లో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
సుమారు రూ.2 కోట్ల స్వంత నిధులతో చేపడుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలకు మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు తెలిపారు. రుద్రభూమిని ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన వసతులు అందించడమే లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.