www.ntodaynews.com
తారకరామ కాలువలో పల్టీ కొట్టిన శ్రీచైతన్య స్కూల్ బస్సు
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
తారకరామ కాలువలో పల్టీ కొట్టిన శ్రీచైతన్య స్కూల్ బస్సు
ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు మండలం కట్టుబడిపాలెం వద్ద శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నంకు చెందిన శ్రీచైతన్య స్కూల్ బస్సు తారకరామ కాలువలో అదుపుతప్పి పల్టీ కొట్టింది.
ఘటన సమయంలో బస్సులో సుమారు 20 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే జి.కొండూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
స్థానికుల సహకారంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టి బస్సులో ఉన్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.