తాటి చెట్టుపై నుండి జారిపడి గీతా కార్మికుడు మృతి: NTODAY NEWS సూర్యాపేట
తాటి చెట్టెక్కిన ఆ గీతా కార్మికుడికి అదే చివరి రోజైంది. ప్రమాదవశాత్తు చెట్టుపై నుండి జారిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన సూర్యాపేట రూరల్ మండలం కె.టి.ఎన్నారం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కె.టి.ఎన్నారం గ్రామానికి చెందిన ఉయ్యాల జానయ్య (38) వృత్తిరీత్యా గీతా కార్మికుడు. ప్రతిరోజూ లాగే సోమవారం సాయంత్రం కూడా కల్లు గీసేందుకు గ్రామ శివారులోని తాటి చెట్టు ఎక్కాడు. అయితే, దురదృష్టవశాత్తు ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడిపోయాడు. పైనుంచి తీవ్రమైన వేగంతో కింద పడటంతో తలకు, శరీర భాగాలకు బలమైన గాయాలై జానయ్య అక్కడికక్కడే తుదిశ్వాస విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ప్రమాదకరమైన వృత్తిని నమ్ముకుని జీవిస్తూ, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జానయ్య కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని స్థానిక గీతా కార్మిక సంఘాల నాయకులు, గ్రామస్థులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ఎక్స్గ్రేషియా అందించి, పిల్లల చదువులకు భరోసా కల్పించాలని వారు కోరారు.