BREAKING
అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం విజయవాడలో భారీ మెగా జాబ్ మేళా
www.ntodaynews.com

​తాటి చెట్టుపై నుండి జారిపడి గీతా కార్మికుడు మృతి: NTODAY NEWS ​సూర్యాపేట

తెలంగాణ
/ సూర్యాపేట / సూర్యాపేట
26 May, 2026 - 08:35 AM
211 వీక్షణలు

తాటి చెట్టెక్కిన ఆ గీతా కార్మికుడికి అదే చివరి రోజైంది. ప్రమాదవశాత్తు చెట్టుపై నుండి జారిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన సూర్యాపేట రూరల్ మండలం కె.టి.ఎన్నారం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

​స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కె.టి.ఎన్నారం గ్రామానికి చెందిన ఉయ్యాల జానయ్య (38) వృత్తిరీత్యా గీతా కార్మికుడు. ప్రతిరోజూ లాగే సోమవారం సాయంత్రం కూడా కల్లు గీసేందుకు గ్రామ శివారులోని తాటి చెట్టు ఎక్కాడు. అయితే, దురదృష్టవశాత్తు ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడిపోయాడు. పైనుంచి తీవ్రమైన వేగంతో కింద పడటంతో తలకు, శరీర భాగాలకు బలమైన గాయాలై జానయ్య అక్కడికక్కడే తుదిశ్వాస విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ  ప్రమాదకరమైన వృత్తిని నమ్ముకుని జీవిస్తూ, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జానయ్య కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని స్థానిక గీతా కార్మిక సంఘాల నాయకులు, గ్రామస్థులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందించి, పిల్లల చదువులకు భరోసా కల్పించాలని వారు కోరారు.