BREAKING
పగటిపూటే ప్రజాధనానికి చితి.. చాట్రాయిలో వెలుగుతున్న వీధి దీపాలపై ప్రజల ఆగ్రహం ఏబీవీపీ నల్గొండ జిల్లా కన్వీనర్‌గా కొంపల్లి సూర్య నియామకం కిశోర బాలికలు, గర్భవతులు పోషకాహారంపై శ్రద్ధ వహించాలి ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంలో నేరుగా అర్జీలు స్వీకరించిన జిల్లా ఎస్పీ ​తాటి చెట్టుపై నుండి జారిపడి గీతా కార్మికుడు మృతి: NTODAY NEWS ​సూర్యాపేట ప్రముఖ పారిశ్రామికవేత్తలు సుదర్శన్ రాజు, సుజన్ రాజులకు ఘనంగా జన్మదిన వేడుకలు.. భారీగా అన్నదానం సచివాలయంలో సిబ్బంది లేక రైతు లు ఇక్కట్లు! పుంగనూరులో దళితులపై అగ్రవర్ణాల అరాచకం.. 'అంబేద్కర్ విగ్రహం పెడితే చంపేస్తాం' అంటూ బెదిరింపులు! శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ పండుగ వాతావరణాన్ని తలపించేలా ఈనెల 27, 28 తేదీలలో తెలుగుదేశం పార్టీ మహానాడు పగటిపూటే ప్రజాధనానికి చితి.. చాట్రాయిలో వెలుగుతున్న వీధి దీపాలపై ప్రజల ఆగ్రహం ఏబీవీపీ నల్గొండ జిల్లా కన్వీనర్‌గా కొంపల్లి సూర్య నియామకం కిశోర బాలికలు, గర్భవతులు పోషకాహారంపై శ్రద్ధ వహించాలి ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంలో నేరుగా అర్జీలు స్వీకరించిన జిల్లా ఎస్పీ ​తాటి చెట్టుపై నుండి జారిపడి గీతా కార్మికుడు మృతి: NTODAY NEWS ​సూర్యాపేట ప్రముఖ పారిశ్రామికవేత్తలు సుదర్శన్ రాజు, సుజన్ రాజులకు ఘనంగా జన్మదిన వేడుకలు.. భారీగా అన్నదానం సచివాలయంలో సిబ్బంది లేక రైతు లు ఇక్కట్లు! పుంగనూరులో దళితులపై అగ్రవర్ణాల అరాచకం.. 'అంబేద్కర్ విగ్రహం పెడితే చంపేస్తాం' అంటూ బెదిరింపులు! శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ పండుగ వాతావరణాన్ని తలపించేలా ఈనెల 27, 28 తేదీలలో తెలుగుదేశం పార్టీ మహానాడు
www.ntodaynews.com

​తాటి చెట్టుపై నుండి జారిపడి గీతా కార్మికుడు మృతి: NTODAY NEWS ​సూర్యాపేట

తెలంగాణ
/ సూర్యాపేట / సూర్యాపేట
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
26 May, 2026 - 08:35 AM
82 వీక్షణలు

తాటి చెట్టెక్కిన ఆ గీతా కార్మికుడికి అదే చివరి రోజైంది. ప్రమాదవశాత్తు చెట్టుపై నుండి జారిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన సూర్యాపేట రూరల్ మండలం కె.టి.ఎన్నారం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

​స్థానికులు మరియు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కె.టి.ఎన్నారం గ్రామానికి చెందిన ఉయ్యాల జానయ్య (38) వృత్తిరీత్యా గీతా కార్మికుడు. ప్రతిరోజూ లాగే సోమవారం సాయంత్రం కూడా కల్లు గీసేందుకు గ్రామ శివారులోని తాటి చెట్టు ఎక్కాడు. అయితే, దురదృష్టవశాత్తు ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడిపోయాడు. పైనుంచి తీవ్రమైన వేగంతో కింద పడటంతో తలకు, శరీర భాగాలకు బలమైన గాయాలై జానయ్య అక్కడికక్కడే తుదిశ్వాస విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ  ప్రమాదకరమైన వృత్తిని నమ్ముకుని జీవిస్తూ, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జానయ్య కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆదుకోవాలని స్థానిక గీతా కార్మిక సంఘాల నాయకులు, గ్రామస్థులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా అందించి, పిల్లల చదువులకు భరోసా కల్పించాలని వారు కోరారు.