BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

తెలంగాణ సరిహద్దు లింగగూడెంలో అక్రమ ఇసుక నిల్వలు.. తెలంగాణకు తరలింపునకు సిద్ధమైన వాహనాలు..!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:09 AM
130 వీక్షణలు

ఏలూరు జిల్లా సరిహద్దు ప్రాంతమైన లింగగూడెం గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను తెలంగాణకు తరలించేందుకు దళారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ శివార్లలో ముందుగానే ఇసుకను డంపులుగా నిల్వ ఉంచి, రాత్రి వేళల్లో టిప్పర్ల ద్వారా సరిహద్దు దాటి తరలించేందుకు సిద్ధం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.

సరిహద్దు ప్రాంతాల్లో గతంలోనూ ఇలాంటి అక్రమ ఇసుక రవాణా జరిగిన ఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, లింగగూడెంలో కూడా అదే తరహా కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఇసుక మాఫియా యథేచ్ఛగా వ్యవహరిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే అక్రమ ఇసుక వ్యాపారం పెరుగుతోందని ఆరోపిస్తున్న గ్రామస్తులు, రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను స్వాధీనం చేసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

లింగగూడెంలోని ఇసుక డంపులపై సంబంధిత శాఖలు వెంటనే దృష్టి సారించి వాస్తవాలను వెలికితీయడంతో పాటు, తెలంగాణకు అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.