BREAKING
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన
www.ntodaynews.com

తెలంగాణ సరిహద్దు లింగగూడెంలో అక్రమ ఇసుక నిల్వలు.. తెలంగాణకు తరలింపునకు సిద్ధమైన వాహనాలు..!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Jun, 2026 - 06:09 AM
37 వీక్షణలు

ఏలూరు జిల్లా సరిహద్దు ప్రాంతమైన లింగగూడెం గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను తెలంగాణకు తరలించేందుకు దళారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ శివార్లలో ముందుగానే ఇసుకను డంపులుగా నిల్వ ఉంచి, రాత్రి వేళల్లో టిప్పర్ల ద్వారా సరిహద్దు దాటి తరలించేందుకు సిద్ధం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.

సరిహద్దు ప్రాంతాల్లో గతంలోనూ ఇలాంటి అక్రమ ఇసుక రవాణా జరిగిన ఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, లింగగూడెంలో కూడా అదే తరహా కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఇసుక మాఫియా యథేచ్ఛగా వ్యవహరిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే అక్రమ ఇసుక వ్యాపారం పెరుగుతోందని ఆరోపిస్తున్న గ్రామస్తులు, రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంపులను స్వాధీనం చేసుకోవాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

లింగగూడెంలోని ఇసుక డంపులపై సంబంధిత శాఖలు వెంటనే దృష్టి సారించి వాస్తవాలను వెలికితీయడంతో పాటు, తెలంగాణకు అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.