BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

తెలంగాణలో 93 వేల పెన్షన్లు రద్దు.. జూలై నుంచి కొత్త లబ్ధిదారుల ఎంపిక

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:34 PM
37 వీక్షణలు

తెలంగాణలో చేయూత పెన్షన్ల ప్రక్షాళన ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ పంపిణీలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా సెర్ప్ నిర్వహించిన ప్రత్యేక సర్వేలో ఇప్పటివరకు 16 లక్షల మందికి పైగా లబ్ధిదారుల వివరాలను పరిశీలించగా, 93,624 మంది అనర్హులుగా గుర్తించబడ్డారు.

అనర్హుల జాబితాలో 40,751 మంది మరణించిన వ్యక్తులు ఉండగా, 41,689 మంది తమ చిరునామాల్లో నివసించడం లేదని అధికారులు గుర్తించారు. మరో 11,184 మందికి ఆధార్ వివరాల్లో లోపాలు ఉన్నట్లు, 3,475 మంది ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లినట్లు తేలింది. దీంతో ఈ నెలాఖరులోగా అనర్హుల పేర్లను జాబితా నుంచి తొలగించే ప్రక్రియ పూర్తి కానుంది.

అనర్హుల తొలగింపు అనంతరం కొత్త లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నారు. ఇప్పటికే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జూలై తొలి వారం నుంచి కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

అర్హులైన పేదలకు మాత్రమే సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.