BREAKING
ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ఈవీఎం గోదాముల వద్ద పటిష్ట భద్రత.. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్.. ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించడంలో జనరిక్ మెడిసిన్స్ కీలకం గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు
www.ntodaynews.com

తెలంగాణలో 93 వేల పెన్షన్లు రద్దు.. జూలై నుంచి కొత్త లబ్ధిదారుల ఎంపిక

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Jun, 2026 - 07:34 PM
13 వీక్షణలు

తెలంగాణలో చేయూత పెన్షన్ల ప్రక్షాళన ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ పంపిణీలో పారదర్శకత తీసుకురావడమే లక్ష్యంగా సెర్ప్ నిర్వహించిన ప్రత్యేక సర్వేలో ఇప్పటివరకు 16 లక్షల మందికి పైగా లబ్ధిదారుల వివరాలను పరిశీలించగా, 93,624 మంది అనర్హులుగా గుర్తించబడ్డారు.

అనర్హుల జాబితాలో 40,751 మంది మరణించిన వ్యక్తులు ఉండగా, 41,689 మంది తమ చిరునామాల్లో నివసించడం లేదని అధికారులు గుర్తించారు. మరో 11,184 మందికి ఆధార్ వివరాల్లో లోపాలు ఉన్నట్లు, 3,475 మంది ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లినట్లు తేలింది. దీంతో ఈ నెలాఖరులోగా అనర్హుల పేర్లను జాబితా నుంచి తొలగించే ప్రక్రియ పూర్తి కానుంది.

అనర్హుల తొలగింపు అనంతరం కొత్త లబ్ధిదారుల ఎంపిక చేపట్టనున్నారు. ఇప్పటికే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వృద్ధులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. జూలై తొలి వారం నుంచి కొత్త పెన్షన్ల మంజూరు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

అర్హులైన పేదలకు మాత్రమే సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ఈ సర్వే ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.