www.ntodaynews.com
తెలంగాణలో ఎండలు 33 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
తెలంగాణ
తెలంగాణలో ఎండలు.. 33 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఏప్రిల్
తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో, హైదరాబాద్ వాతావరణ కేంద్రం 33 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏప్రిల్ 25, 26 తేదీల్లో పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు పైగా చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రధాన సూచనలు: పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ సమయం ఎండలో ఉండకూడదు. శరీరాన్ని తేమగా ఉంచుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం. ఈ నేపథ్యంలో, వర్షాకాలం ముందుగానే ప్రారంభం కానుందని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 30 వరకు ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు. జాగ్రత్తగా ఉండండి.