BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

తెనాలిలో దొంగల బీభత్సం: వరుస చోరీలతో ప్రజల్లో భయాందోళనలు

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
17 Jun, 2026 - 11:44 AM
71 వీక్షణలు

గుంటూరు జిల్లా తెనాలి పరిసర ప్రాంతాల్లో వరుస చోరీ ఘటనలు చోటుచేసుకుంటుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఒకదాని వెంట ఒకటి జరుగుతున్న దొంగతనాలు స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

ఇటీవల హాఫ్‌పేటలో పట్టపగలే ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు నగదును అపహరించారు. అలాగే కట్టేవరంలో ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన కుటుంబం తిరిగి వచ్చేసరికి ఇంట్లోని నగలు, నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. మరోవైపు రజకచెరువు ప్రాంతంలోని రాములవారి ఆలయంలో చోరీయత్నం జరగగా, ఎరుకలపూడిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో రాగి, ఇత్తడి సామగ్రిని దుండగులు అపహరించారు.

తాజాగా సుల్తానాబాద్‌లో ఓ మహిళ ఇంట్లో భారీ మొత్తంలో నగలు, నగదు మాయమైన ఘటన కలకలం రేపింది. వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలు పోలీసుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

ఈ చోరీల వెనుక ఒకే ముఠా ఉందా? లేక వేర్వేరు వ్యక్తుల ప్రమేయం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ప్రజలు రాత్రి వేళల్లో పోలీసు గస్తీని మరింత పెంచాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణను బలోపేతం చేయాలని కోరుతున్నారు.