BREAKING
​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం
www.ntodaynews.com

తెనాలిలో దొంగల బీభత్సం: వరుస చోరీలతో ప్రజల్లో భయాందోళనలు

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
ANNAPAREDDY SIVA NAGENDRA గుంటూరు టౌన్ రిపోర్టర్
17 Jun, 2026 - 11:44 AM
17 వీక్షణలు

గుంటూరు జిల్లా తెనాలి పరిసర ప్రాంతాల్లో వరుస చోరీ ఘటనలు చోటుచేసుకుంటుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఒకదాని వెంట ఒకటి జరుగుతున్న దొంగతనాలు స్థానికులను భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

ఇటీవల హాఫ్‌పేటలో పట్టపగలే ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు నగదును అపహరించారు. అలాగే కట్టేవరంలో ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లిన కుటుంబం తిరిగి వచ్చేసరికి ఇంట్లోని నగలు, నగదు చోరీకి గురైనట్లు గుర్తించారు. మరోవైపు రజకచెరువు ప్రాంతంలోని రాములవారి ఆలయంలో చోరీయత్నం జరగగా, ఎరుకలపూడిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో రాగి, ఇత్తడి సామగ్రిని దుండగులు అపహరించారు.

తాజాగా సుల్తానాబాద్‌లో ఓ మహిళ ఇంట్లో భారీ మొత్తంలో నగలు, నగదు మాయమైన ఘటన కలకలం రేపింది. వరుసగా జరుగుతున్న ఈ సంఘటనలు పోలీసుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

ఈ చోరీల వెనుక ఒకే ముఠా ఉందా? లేక వేర్వేరు వ్యక్తుల ప్రమేయం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ప్రజలు రాత్రి వేళల్లో పోలీసు గస్తీని మరింత పెంచాలని, సీసీ కెమెరాల పర్యవేక్షణను బలోపేతం చేయాలని కోరుతున్నారు.