www.ntodaynews.com
తిరుమల శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. ఒక్కరోజులో రూ.6.12 కోట్లు
ఆంధ్రప్రదేశ్
/
తిరుపతి
తిరుమల శ్రీవారి హుండీకి భారీ ఆదాయం.. ఒక్కరోజులో రూ.6.12 కోట్లు
తిరుమల:
శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి రికార్డు స్థాయిలో నమోదైంది. నిన్న ఒక్కరోజే భక్తులు సమర్పించిన కానుకల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.6.12 కోట్ల ఆదాయం లభించింది.
గత కొన్ని నెలలుగా శ్రీవారి హుండీ ఆదాయం రోజువారీగా సగటున రూ.3.5 కోట్ల నుంచి రూ.5.5 కోట్ల మధ్య నమోదవుతోంది. తాజాగా ఈ ఆదాయం రూ.6 కోట్ల మార్క్ను దాటడం విశేషం.
అయితే శ్రీవారి హుండీ ఆదాయంలో ఇప్పటివరకు అత్యధికంగా నమోదైన రికార్డు 2023 జనవరి 2న నమోదైన రూ.7.63 కోట్లు. ఆ రోజు ఆదాయం ఇప్పటికీ ఆల్టైమ్ రికార్డుగా కొనసాగుతోంది. భక్తుల భారీ రద్దీ, మొక్కుల సమర్పణలతో శ్రీవారి హుండీ ఆదాయం నిరంతరం పెరుగుతోంది.