BREAKING
అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు రైతులకు సాగునీరు, త్రాగునీరు కోసం తగ్గేదేలా అంటున్న YSRCP నంద్యాల జిల్లా మాజీ MLA లు శిల్పా & sons తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష అంగరంగ వైభవంగా పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకలు గుంటూరు: సైబర్ ఎటాక్.. ఓటీడీ రాకుండానే రూ.4 లక్షలు కట్ ...... డ్రోన్ నిఘాతో ఉక్కుపాదం గుంటూరు.... దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి వేడుకలు రైతులకు సాగునీరు, త్రాగునీరు కోసం తగ్గేదేలా అంటున్న YSRCP నంద్యాల జిల్లా మాజీ MLA లు శిల్పా & sons తప్పిపోయిన వృద్ధ మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు పలమనేరు–బెంగళూరు హైవేపై రోడ్డు ప్రమాదం ఎల్కతుర్తిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం లబ్ధిదారులకు పెన్షన్లు అందచేసిన కమిషనర్ NHAI అధికారులతో కేంద్ర మంత్రి పెమ్మసాని సమీక్ష
Date of Publish : 02 September 2026, 01:15 pm
Posted by : DAVU RAVINDER REDDY

తిరుమల వెళ్తున్నారా? ఒక్క రోజు టోకెన్లు రద్దు!

భక్తి
Reporter
Davu Ravinder Reddy Ghatkesar Mandal Reporter
02 Sep, 2026 - 01:15 PM
2 వీక్షణలు

తిరుమల వెళ్తున్నారా? ఒక్క రోజు టోకెన్లు రద్దు!

Tirumala News: తిరుమలలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. భక్తుల కోలాహలంతో కలియుగ వైకుంఠం కిటకిటలాడుతోంది. శ్రీవారి దివ్యదర్శనం కోసం పరితపించే భక్తులకు తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ముఖ్యమైన సమాచారం అందించింది. భక్తుల రద్దీ నియంత్రణ, ఇతర ప్రత్యేక ఏర్పాట్ల నిమిత్తం తిరుపతిలోని మూడు కేంద్రాల వద్ద జారీ చేసే ఎస్ఎస్ఓ టోకెన్లను బుధవారం ఒక్కరోజు రద్దు చేశారు.

శుక్రవారం శ్రీవారి దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్ఓ టోకెన్ల జారీ ప్రక్రియ గురువారం నుంచి యథావిధిగా ప్రారంభమవుతుందని అధికారులు స్పష్టం చేశారు. అయితే గత పది వారాలుగా వరుసగా టోకెన్ల రద్దు నిర్ణయాలుఅమలవుతుండటంతో వివిధ సుదూర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో తరలివచ్చే సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోకెన్లు లభించక గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ తరుణంలో భక్తుల రద్దీ మరింత విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత సెప్టెంబర్ మాసంలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో దేశ విదేశాల నుంచి వచ్చే వేలాది మంది భక్తులతో తిరుమల కిక్కిరిసిపోయే పరిస్థితి కనిపిస్తోంది. బ్రహ్మోత్సవాల వేళ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు టీటీడీ అధికారులు ముందస్తు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.

గడచిన ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారిని మొత్తం 24.56 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.137.44 కోట్లు లభించింది. ఏటా మాదిరిగానే ఈసారి కూడా భక్తుల నుంచి భారీ స్పందన లభించడం విశేషం.

బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న వేళ రద్దీని దృష్టిలో ఉంచుకొని భక్తులు తమ ప్రయాణ ఏర్పాట్లను ముందస్తుగా చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. టోకెన్ల జారీ విధానంపై ఎప్పటికప్పుడు వచ్చే అధికారిక ప్రకటనలను గమనించాలని కోరుతున్నారు. స్వామివారి సేవలో తరించేందుకు విచ్చేసే ప్రతి ఒక్కరికీ మెరుగైన వసతి, ప్రసాద వితరణ అందేలా అన్ని విభాగాల సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. ఇకపోతే ఈసారి తిరుమలలో రెండు సార్లు బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. అధిక మాసం కారణం. అందువల్ల ఈ నెలలో, అక్టోబర్ నెలలో తిరుమల వెళ్లాలని భావించే భక్తులు ఈవిషయాన్ని గుర్తించుకోవాలి.