www.ntodaynews.com
తిరుమలలో ఏపీ డీజీపీ.. శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనలు..!
ఆంధ్రప్రదేశ్
/
తిరుపతి
తిరుమల, జూన్ 26: ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. డీజీపీ రాక సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
దర్శనం అనంతరం టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర శ్రీవారి తీర్థప్రసాదాలు, లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదమంత్రోచ్ఛారణతో ఆశీర్వచనం అందించారు.
ప్రస్తుతం రాష్ట్రంలో శాంతిభద్రతలు, కీలక పరిణామాల నేపథ్యంలో డీజీపీ తిరుమల పర్యటనకు ప్రాధాన్యత నెలకొంది. ఈ కార్యక్రమంలో సీవీఎస్వో మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు పాల్గొన్నారు.