BREAKING
కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి అనంతసాగరంలో SIR ప్రక్రియ మందగమనం.. 14 రోజులు గడువు, 20% నమోదు మాత్రమే
www.ntodaynews.com

తిరుపతిలో గంజాయి ముఠాపై పోలీసుల ఉక్కుపాదం.. 18 కేజీల గంజాయి స్వాధీనం, 6 మంది అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 03:35 PM
13 వీక్షణలు

తిరుపతి నగరంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు భారీ చర్యలు చేపట్టారు. నగరంలోని కోటకొమ్మల వీధి, దొడ్డపురం వీధి, పెద్దకాపు లే అవుట్, కట్టమంచి ప్రాంతాలకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 18 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

రెండు రోజుల క్రితం కోటకొమ్మల వీధిలో గంజాయి మత్తులో కొందరు యువకులు గొడవలకు దిగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో గంజాయి విక్రయాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

జీవకోన అరుణోదయ కాలనీకి చెందిన ఆదినారాయణ అనే వ్యక్తి రెండు కేజీల గంజాయితో అలిపిరి పోలీసులకు పట్టుబడి సోమవారం రిమాండ్‌కు వెళ్లాడు. అనంతరం దొడ్డపురంకు చెందిన హరికృష్ణ అలియాస్ హరికృష్ణ రెడ్డి, కోటకొమ్మల వీధికి చెందిన ఉదయ్ కుమార్, దొడ్డపురం వీధికి చెందిన జ్ఞానచరణ్, కట్టమంచికి చెందిన వెంకట సాయిని పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళవారం కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు.

ఈ కేసులో ఉన్న ఇద్దరు మైనర్ బాలురను కోర్టు ఆదేశాల మేరకు బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.

అయితే, అరెస్ట్ అయిన మైనర్ బాలురకు గంజాయి లావాదేవీలతో ఎలాంటి సంబంధం లేదని వారి తల్లిదండ్రులు ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ పిల్లలకు గంజాయి విక్రయించే అలవాటు లేదని, వారిని అన్యాయంగా ఇరికించారని ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు నిరసనకారులను అక్కడి నుంచి పంపించారు.