BREAKING
శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి
www.ntodaynews.com

తిరుపతిలో గంజాయి ముఠాపై పోలీసుల ఉక్కుపాదం.. 18 కేజీల గంజాయి స్వాధీనం, 6 మంది అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 03:35 PM
49 వీక్షణలు

తిరుపతి నగరంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు భారీ చర్యలు చేపట్టారు. నగరంలోని కోటకొమ్మల వీధి, దొడ్డపురం వీధి, పెద్దకాపు లే అవుట్, కట్టమంచి ప్రాంతాలకు చెందిన ఆరుగురిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 18 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

రెండు రోజుల క్రితం కోటకొమ్మల వీధిలో గంజాయి మత్తులో కొందరు యువకులు గొడవలకు దిగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో గంజాయి విక్రయాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

జీవకోన అరుణోదయ కాలనీకి చెందిన ఆదినారాయణ అనే వ్యక్తి రెండు కేజీల గంజాయితో అలిపిరి పోలీసులకు పట్టుబడి సోమవారం రిమాండ్‌కు వెళ్లాడు. అనంతరం దొడ్డపురంకు చెందిన హరికృష్ణ అలియాస్ హరికృష్ణ రెడ్డి, కోటకొమ్మల వీధికి చెందిన ఉదయ్ కుమార్, దొడ్డపురం వీధికి చెందిన జ్ఞానచరణ్, కట్టమంచికి చెందిన వెంకట సాయిని పోలీసులు అదుపులోకి తీసుకుని మంగళవారం కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు.

ఈ కేసులో ఉన్న ఇద్దరు మైనర్ బాలురను కోర్టు ఆదేశాల మేరకు బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.

అయితే, అరెస్ట్ అయిన మైనర్ బాలురకు గంజాయి లావాదేవీలతో ఎలాంటి సంబంధం లేదని వారి తల్లిదండ్రులు ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ పిల్లలకు గంజాయి విక్రయించే అలవాటు లేదని, వారిని అన్యాయంగా ఇరికించారని ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు నిరసనకారులను అక్కడి నుంచి పంపించారు.