www.ntodaynews.com
తిరువూరు బస్టాండ్ను తనిఖీ చేసిన ఆర్డీవో.. మరుగుదొడ్ల నిర్వహణపై అసంతృప్తి
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
తిరువూరు బస్టాండ్ను తనిఖీ చేసిన ఆర్డీవో.. మరుగుదొడ్ల నిర్వహణపై అసంతృప్తి
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు బస్టాండ్ను శనివారం ఆర్డీవో ఏ. కుమార్ తనిఖీ చేశారు. బస్టాండ్లోని మరుగుదొడ్ల ప్రాంతంలో హోటల్ నిర్వహిస్తుండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాత మరుగుదొడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, వాటిని తొలగించి ఆధునిక సౌకర్యాలతో కొత్త మరుగుదొడ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు.
నిర్దిష్ట గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు. అలాగే బస్టాండ్ పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి ప్రయాణికులకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.
ఈ తనిఖీలో మున్సిపల్ కమిషనర్ కే. మనోజ్, తహసీల్దార్ డి. చంద్రమౌళి, ఆర్టీసీ డీఎం ఏ. సుబ్రహ్మణ్యం తదితర అధికారులు పాల్గొన్నారు.