BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

తిరువూరు లో జాతీయ లోక్ అదాలత్ సన్నాహక సదస్సు నిర్వహణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Jun, 2026 - 06:26 AM
97 వీక్షణలు

జులై 7న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నేపథ్యంలో తిరువూరులో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సింధూర సన్నాహక సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో తిరువూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గిరిబాబు, తిరువూరు, గంపలగూడెం, విస్సన్నపేట, ఎ.కొండూరు మరియు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల సబ్ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు. అలాగే బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సభ్యులు, న్యాయవాదులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ మాట్లాడుతూ, “రాజీ మార్గమే – రాజమార్గం” అనే సూత్రంతో నిర్వహించే లోక్ అదాలత్ ద్వారా కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో కక్షిదారులు పరస్పర రాజీకి వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. దీనివల్ల న్యాయ వివాదాలు తగ్గడంతో పాటు బాధితులకు త్వరితగతిన ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు.

జాతీయ లోక్ అదాలత్ ద్వారా అందుబాటులో ఉన్న ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.