తిరువూరు లో జాతీయ లోక్ అదాలత్ సన్నాహక సదస్సు నిర్వహణ
జులై 7న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నేపథ్యంలో తిరువూరులో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సింధూర సన్నాహక సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిబాబు, తిరువూరు, గంపలగూడెం, విస్సన్నపేట, ఎ.కొండూరు మరియు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల సబ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. అలాగే బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సభ్యులు, న్యాయవాదులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ మాట్లాడుతూ, “రాజీ మార్గమే – రాజమార్గం” అనే సూత్రంతో నిర్వహించే లోక్ అదాలత్ ద్వారా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసుల్లో కక్షిదారులు పరస్పర రాజీకి వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. దీనివల్ల న్యాయ వివాదాలు తగ్గడంతో పాటు బాధితులకు త్వరితగతిన ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు.
జాతీయ లోక్ అదాలత్ ద్వారా అందుబాటులో ఉన్న ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.