BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

తిరువూరు రైతు బజార్‌లో ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 02:13 PM
56 వీక్షణలు

తిరువూరు రైతు బజార్‌లో ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం

తిరువూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ప్రత్యేక బియ్యం విక్రయ కార్యక్రమంలో భాగంగా తిరువూరు రైతు బజార్‌లో ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాన్ని సోమవారం తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి ఏ. కుమార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందించేందుకు ఈ ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆధార్ కార్డు నంబర్ ఆధారంగా మొబైల్ యాప్ ద్వారా బియ్యం విక్రయాలు నిర్వహిస్తామని, ప్రతి రేషన్ కార్డుదారునికి నెలకు గరిష్టంగా 10 కిలోల బియ్యం అందజేస్తామని వివరించారు.

ప్రభుత్వ నిర్ణయం మేరకు స్టీమ్ బియ్యాన్ని కిలో రూ.52, రా బియ్యాన్ని కిలో రూ.50 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలిపారు. తిరువూరు రైతు బజార్‌తో పాటు తిరువూరు డివిజన్ పరిధిలోని 9 సీఎంఆర్ రైస్ మిల్లుల్లో కూడా ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.

ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు నాణ్యమైన బియ్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన కోరారు.

కార్యక్రమంలో తహసీల్దార్, సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్, అధికారులు, రైస్ మిల్లర్లు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.