BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

తిరువూరు సచివాలయం-1ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Aug, 2026 - 07:10 PM
32 వీక్షణలు

తిరువూరు సచివాలయం-1ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

తిరువూరు సచివాలయం-1లో ఆకస్మిక తనిఖీ

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: మున్సిపల్ కమిషనర్ కె. మనోజ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం తిరువూరులోని సచివాలయం-1ను శనివారం మున్సిపల్ కమిషనర్ కె. మనోజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో నిర్వహిస్తున్న వివిధ రికార్డులను పరిశీలించి వాటి నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.

కార్యాలయ వేళల్లో సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రభుత్వం అందిస్తున్న సేవలను పారదర్శకంగా, వేగవంతంగా అందించాలని ఆదేశించారు. ప్రతి రికార్డును నిబంధనల ప్రకారం సక్రమంగా నిర్వహించడంతో పాటు అవసరమైన వివరాలను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలని సూచించారు.

విధుల నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సేవలు అందించాలని కమిషనర్ పేర్కొన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించినా, ప్రజలకు అందుబాటులో లేకపోయినా, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించకపోయినా సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఆ లక్ష్య సాధనకు ప్రతి ఉద్యోగి అంకితభావంతో పనిచేయాలని కమిషనర్ కె. మనోజ సూచించారు.