తిరువూరు శ్రీనిధి హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ మెరుపులు
తిరువూరు శ్రీనిధి హైస్కూల్ విద్యార్థుల ప్రతిభ మెరుపులు
2025–2026 ఎస్ఎస్సీ ఫలితాల్లో స్థానిక శ్రీనిధి హైస్కూల్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చారు. టి. రమ్య శ్రీ 591 మార్కులతో సెకండ్ డివిజన్ సాధించి ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇతర విద్యార్థుల్లో జి. జోషిత (585), వి. ధరణి (582), బి. ప్రణతి (578), షేక్ కౌసర్ (575), యన్. షణ్మిత్ (574) మంచి మార్కులు సాధించి పాఠశాలకు గౌరవం తీసుకొచ్చారు.
అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల ఆవరణలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ముత్యాల కిషోర్ బాబు, డైరెక్టర్ బొంతు మహేశ్వరరావు, ప్రిన్సిపల్ ఆర్ వెంకట్ నారాయణ, హయ్యర్ ఇంచార్జి పి.డి. సునీల్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాల యాజమాన్యం విద్యార్థులను అభినందించింది.